'టీవీ5 ఎడిటర్ దినేష్ ఆకుల' కు ప్రతిష్టాత్మకమైన రామ్నాథ్ గోయెంకా అవార్డు
- December 20, 2017
ఢిల్లీ: జర్నలిజం రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామ్నాథ్ గోయెంకా అవార్డు టీవీ5 ఎడిటర్ దినేష్ ఆకులను వరించింది. ఢిల్లీలో వైభవంగా జరిగిన కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి M.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా దినేష్ ఆకుల అవార్డు అందుకున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ వ్యవస్థాపకుడు రామ్నాథ్ గోయెంకా జన్మదినం సందర్భంగా ఈ అవార్డులు ప్రధానం చేయడం ఆనవాయితీ. జర్నలిజంలో నిస్పాక్షికత, ఖచ్చితత్వం, సామాజిక బాధ్యత, నిబద్ధత, ఇన్వెస్టిగేషన్ వంటి అంశాల ఆధారంగా అవార్డు విజేతల ఎంపిక జరుగుతుంది.
రామ్నాథ్ గోయెంకా అవార్డు కోసం ఈ ఏడాది దాదాపు 800 ఎంట్రీలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కష్టాలను టీవీ 5 ప్రసారం చేసిన చేనేత కథలు సిరీస్ పురస్కారానికి ఎంపికైంది. చేనేత రంగం ఎదుర్కొంటున్న దుస్థితి, నేతన్నలు పడుతున్న కష్టాలను గ్రౌండ్ రిపోర్ట్ రూపంలో ప్రేక్షకుల కళ్లకు కట్టారు. అత్యంత హృద్యంగా ఉన్న చేనేత కథల సిరీస్ను... జస్టిస్ శ్రీకృష్ణ, దీపక్ పరేఖ్, పమేలా ఫిలిపోస్, SY ఖురేషి, వంటి ఉద్దండులతో కూడిన జ్యూరీ... టీవీ5ని అవార్డుకు ఎంపిక చేసింది.


తాజా వార్తలు
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు







