బహ్రెయిన్లో ఫుడ్ బ్యాంక్: త్వరలో ప్రారంభం
- December 20, 2017
మనామా: లాభాపేక్ష లేని ఫుడ్ బ్యాంక్ని బహ్రెయిన్లో త్వరలో ఏర్పాటు చేయనున్నారు. వృధాని తగ్గించడంతోపాటు, ప్రజల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు తద్వారా పేదలకు సాంత్వన కలిగేందుకు వీలుగా ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ బిన్ మొహమ్మద్ అలి అహుమైదాన్, ఈ మేరకు బహ్రెయిన్ ఎమ్దాద్ సొసైటీ (బహ్రెయిన్ ఫుడ్ బ్యాంక్) ఛైర్మన్ మరియు ఫౌండర్ అయిన ఇబ్రహీమ్ అలీ దైసికి ఈ మేరకు స్వాగతం పలికారు. హైపర్ మార్కెట్స్ని సందర్శించి, ప్రతి యేడాదీ ఎంతో కొంత మొత్తంలో వారి నుంచి సహాయాన్ని ఆర్ధించనున్నారు. వారి నుంచి అందే వస్తువుల్ని అవసరమైన పేదలకు పంచిపెట్టనున్నారు. ఒక్కసారి ఇది ఏర్పాటైతే, ఈ సొసైటీ ద్వారా వివిధ రెస్టారెంట్లనుంచి సంప్రదించి, అక్కడ అమ్మకం అయిపోగా మిగిలిపోయిన ఆహార పదార్థాల్ని సేకరించి, వాటిని పేదలకు అందిస్తారు. పెద్ద పెద్ద వేడుకల సందర్భంగా మిగిలిపోయిన ఆహార పదార్థాల్ని కూడా సేకరించడం ఈ ఫుడ్ బ్యాంక్ లక్ష్యం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల