బహ్రెయిన్లో ఫుడ్ బ్యాంక్: త్వరలో ప్రారంభం
- December 20, 2017మనామా: లాభాపేక్ష లేని ఫుడ్ బ్యాంక్ని బహ్రెయిన్లో త్వరలో ఏర్పాటు చేయనున్నారు. వృధాని తగ్గించడంతోపాటు, ప్రజల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు తద్వారా పేదలకు సాంత్వన కలిగేందుకు వీలుగా ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ బిన్ మొహమ్మద్ అలి అహుమైదాన్, ఈ మేరకు బహ్రెయిన్ ఎమ్దాద్ సొసైటీ (బహ్రెయిన్ ఫుడ్ బ్యాంక్) ఛైర్మన్ మరియు ఫౌండర్ అయిన ఇబ్రహీమ్ అలీ దైసికి ఈ మేరకు స్వాగతం పలికారు. హైపర్ మార్కెట్స్ని సందర్శించి, ప్రతి యేడాదీ ఎంతో కొంత మొత్తంలో వారి నుంచి సహాయాన్ని ఆర్ధించనున్నారు. వారి నుంచి అందే వస్తువుల్ని అవసరమైన పేదలకు పంచిపెట్టనున్నారు. ఒక్కసారి ఇది ఏర్పాటైతే, ఈ సొసైటీ ద్వారా వివిధ రెస్టారెంట్లనుంచి సంప్రదించి, అక్కడ అమ్మకం అయిపోగా మిగిలిపోయిన ఆహార పదార్థాల్ని సేకరించి, వాటిని పేదలకు అందిస్తారు. పెద్ద పెద్ద వేడుకల సందర్భంగా మిగిలిపోయిన ఆహార పదార్థాల్ని కూడా సేకరించడం ఈ ఫుడ్ బ్యాంక్ లక్ష్యం.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు