ఒమనీ స్టూడెంట్స్కి 50 కిలోల బ్యాగేజ్ని ప్రకటించిన ఒమన్ ఎయిర్
- December 20, 2017
మస్కట్: ఒమన్ ఎయిర్, ఒమనీ స్టూడెంట్స్కి మద్దతుగా కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా స్టూడెంట్స్కి 20 కిలోల బ్యాగేజ్కి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 30 కిలోల బ్యాగేజీకి ఈ ఆఫర్ అదనం. 2018 చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది ఒమన్ ఎయిర్. ఒమన్ ఎయిర్కి సంబంధించి అన్ని అంతర్జాతీయ డెస్టినేషన్స్కీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒమన్ ఎయిర్ కంట్రీ మేనేజర్ జమాల్ అల్ అజ్కి మాట్లాడుతూ, ఒమన్ సిటిజన్స్ పట్ల ప్రత్యేకమైన అభిమానం తమకుందని తాము మరోమారు ఈ నిర్ణయం ద్వారా చాటుకోగలిగామనీ, శెలవుల కోసం గానీ, స్టడీ కోసం గానీ, ఇతత్రా విద్యా వ్యవహారాలకు సంబంధించిగానీ విమాన ప్రయాణం చేసే ఒమన్ విద్యార్థులకు ఈ నిర్ణయం కొత్త ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







