ఒమనీ స్టూడెంట్స్కి 50 కిలోల బ్యాగేజ్ని ప్రకటించిన ఒమన్ ఎయిర్
- December 20, 2017
మస్కట్: ఒమన్ ఎయిర్, ఒమనీ స్టూడెంట్స్కి మద్దతుగా కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా స్టూడెంట్స్కి 20 కిలోల బ్యాగేజ్కి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 30 కిలోల బ్యాగేజీకి ఈ ఆఫర్ అదనం. 2018 చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది ఒమన్ ఎయిర్. ఒమన్ ఎయిర్కి సంబంధించి అన్ని అంతర్జాతీయ డెస్టినేషన్స్కీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒమన్ ఎయిర్ కంట్రీ మేనేజర్ జమాల్ అల్ అజ్కి మాట్లాడుతూ, ఒమన్ సిటిజన్స్ పట్ల ప్రత్యేకమైన అభిమానం తమకుందని తాము మరోమారు ఈ నిర్ణయం ద్వారా చాటుకోగలిగామనీ, శెలవుల కోసం గానీ, స్టడీ కోసం గానీ, ఇతత్రా విద్యా వ్యవహారాలకు సంబంధించిగానీ విమాన ప్రయాణం చేసే ఒమన్ విద్యార్థులకు ఈ నిర్ణయం కొత్త ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









