కనిష్ఠానికి చేరిన బంగారం ధర

- November 18, 2015 , by Maagulf
కనిష్ఠానికి చేరిన బంగారం ధర

మంగళవారం నాలుగు నెలల కనిష్ఠానికి చేరిన బంగారం ధర ఈ రోజు మరింత తగ్గింది. రూ.75 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.25,625కు చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర మరింత దిగివచ్చిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో సైతం ఔన్సు బంగారం ధర 1,064.55 అమెరికన్‌ డాలర్లుగా ఉండగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో 1,069.80 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. అయితే ఈ రోజు వెండి ధరలో ఎలాంటి మార్పులూ లేకుండా మంగళవారం నాటి ధరే స్థిరంగా ఉంది. దీంతో కేజీ వెండి ధర రూ.34,100గా నమోదయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com