కనిష్ఠానికి చేరిన బంగారం ధర
- November 18, 2015
మంగళవారం నాలుగు నెలల కనిష్ఠానికి చేరిన బంగారం ధర ఈ రోజు మరింత తగ్గింది. రూ.75 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.25,625కు చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర మరింత దిగివచ్చిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో సైతం ఔన్సు బంగారం ధర 1,064.55 అమెరికన్ డాలర్లుగా ఉండగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో 1,069.80 అమెరికన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ రోజు వెండి ధరలో ఎలాంటి మార్పులూ లేకుండా మంగళవారం నాటి ధరే స్థిరంగా ఉంది. దీంతో కేజీ వెండి ధర రూ.34,100గా నమోదయ్యింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







