ఫోర్జరీ కేసులో నిందితునికి నాలుగు సంవత్సరాల జైలుశిక్ష
- December 22, 2017
కువైట్ : ఒక కేసుకి సంబంధించిన పత్రాలలో తన కవల సోదరుని గుర్తింపు పత్రాన్ని ఉపయోగించి అనుమానితుడు కేసు నుంచి తప్పుకోవాలని ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఫోర్జరీ నేరానికి గాను ఆ పౌరుడికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. తప్పుడు ఐ డి ని ఉపయోగించి అరెస్ట్ నుంచి అతి తెలివిగా తప్పించుకోవాలనే ఎత్తుగడను డిటెక్టివ్ లు చేధించారు. అనుమానితుడు తనిఖీ కేంద్రంలో జరగబోయిన పరీక్షలో వరుసలో ముందుకు వెళ్లకుండా నిలిచి తచ్చట్లాడుతున్నాడు. ఆ పౌరుని వాలకం పసిగట్టిన డిటెక్టివ్ లు నిందితుని వేలిముద్రలను సరిపోల్చి గుర్తించటానికి ప్రయత్నించినప్పుడు నిందితుని గుట్టు రట్టయింది. తన కవల సోదరుని గుర్తింపత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







