నన్ను క్షమించండి అంటూ ట్వీట్ చేసిన శిల్పా శెట్టి
- December 23, 2017
ముంబయి: ఎస్సీలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు గానూ వాల్మీకి సంఘ కార్యకర్తలు బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టిలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై శిల్పా శెట్టి ట్విటర్ ద్వారా స్పందిస్తూ క్షమాపణ చెప్పారు. 'ఓ ఇంటర్వ్యూలో నా మాటలను తప్పుగా అర్థంచేసుకున్నారు. నేను ఎవ్వరినీ కించపరిచేలా మాట్లాడలేదు. నా వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించండి. విభిన్న మతాలు, జాతులకు ప్రతీకైన భారతదేశంలో నేను పుట్టినందుకు గర్విస్తున్నాను. అన్ని మతాలపై గౌరవం ఉంది' అని శిల్పా ట్వీట్లో పేర్కొన్నారు. ఈ విషయంపై సల్మాన్ ఇంకా స్పందించలేదు. దాంతో ఆయన నటించిన'టైగర్ జిందా హై' సినిమాను చూడనివ్వమంటూ వాల్మీకి కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







