నన్ను క్షమించండి అంటూ ట్వీట్ చేసిన శిల్పా శెట్టి
- December 23, 2017
ముంబయి: ఎస్సీలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు గానూ వాల్మీకి సంఘ కార్యకర్తలు బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టిలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై శిల్పా శెట్టి ట్విటర్ ద్వారా స్పందిస్తూ క్షమాపణ చెప్పారు. 'ఓ ఇంటర్వ్యూలో నా మాటలను తప్పుగా అర్థంచేసుకున్నారు. నేను ఎవ్వరినీ కించపరిచేలా మాట్లాడలేదు. నా వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించండి. విభిన్న మతాలు, జాతులకు ప్రతీకైన భారతదేశంలో నేను పుట్టినందుకు గర్విస్తున్నాను. అన్ని మతాలపై గౌరవం ఉంది' అని శిల్పా ట్వీట్లో పేర్కొన్నారు. ఈ విషయంపై సల్మాన్ ఇంకా స్పందించలేదు. దాంతో ఆయన నటించిన'టైగర్ జిందా హై' సినిమాను చూడనివ్వమంటూ వాల్మీకి కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల