ప్రపంచంలోనే పొడవైన గాజు వంతెన ప్రారంభం

- December 24, 2017 , by Maagulf
ప్రపంచంలోనే పొడవైన గాజు వంతెన ప్రారంభం

ప్రపంచంలోనే అత్యధిక జనాభ గల చైనా సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకోవడంలో కూడా ముందుంటుంది. చైనాలో గాజుపలకల వంతెన ఆదివారం ప్రారంభమైంది. హెబీ ప్రాంతంలోని షిజియాజుయాంగ్‌లో రెండు మీటర్ల వెడల్పు, 448 మీటర్ల పొడవైన గాజు వంతెనను నిర్మించారు. ఈ వంతెన ప్రపంచంలోనే పొడవైన వంతెన. ఈ గాజు వంతెన నిర్మాణం కోసం 1077 గాజు పారదర్శక పలకలను ఉపయోగించారు. ఈ పలక ఒక్కొక్కటి 4 సెంమీ మందం ఉంటుంది. ఒకేసారి 2000 మంది ఎక్కే సామర్థ్యం కలిగిన ఈ గాజు వంతెన పర్యాటకులు నడుస్తన్న సమయంలో కొంచెం ఊగుతూ ఉండేలా నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ వంతెన పై నడవడం ధైరవంతులతోనే అవుతుందని, దానిపై నడుస్తుంటే వెన్నులో వణుకుపుడుతుందని ఈ వంతెన పై 500 మందికి ఎక్కే అనుమతి ఇస్తామని నిర్మాణ సంస్థ ఇన్‌ఛార్జీ డైరెక్టర్ లియూ కికి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com