రేపు గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారం
- December 25, 2017
గుజరాత్లో వరుసగా ఆరోసారి విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ మంగళవారం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. గాంధీనగర్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ, ఉపముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశమున్నట్లు ఆ రాష్ట్ర గుజరాత్ అధ్యక్షుడు జితు వఘానీ తెలిపారు. అంతేగాక.. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ సీనియర్ నేతలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రిగా ప్రస్తుత సీఎం రూపానీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఈ నెల 23న భాజపా రాష్ట్ర నేతలు గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు గవర్నర్ కూడా ఆమోదించారు. ఈ ఎన్నికల్లో భాజపా విజయం సాధించినప్పటికీ..
ఆశించిన మెజార్టీ దక్కించుకోలేకపోయింది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో భాజపా 99 సీట్లు సాధించింది.ఒక స్వతంత్ర ఎమ్మెల్యే భాజపాకు మద్దతు ప్రకటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్కు 77 సీట్లు రాగా.. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ఆ పార్టీ సంఖ్య 80కి చేరింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!