రేపు గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారం
- December 25, 2017
గుజరాత్లో వరుసగా ఆరోసారి విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ మంగళవారం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. గాంధీనగర్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ, ఉపముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశమున్నట్లు ఆ రాష్ట్ర గుజరాత్ అధ్యక్షుడు జితు వఘానీ తెలిపారు. అంతేగాక.. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ సీనియర్ నేతలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రిగా ప్రస్తుత సీఎం రూపానీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఈ నెల 23న భాజపా రాష్ట్ర నేతలు గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు గవర్నర్ కూడా ఆమోదించారు. ఈ ఎన్నికల్లో భాజపా విజయం సాధించినప్పటికీ..
ఆశించిన మెజార్టీ దక్కించుకోలేకపోయింది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో భాజపా 99 సీట్లు సాధించింది.ఒక స్వతంత్ర ఎమ్మెల్యే భాజపాకు మద్దతు ప్రకటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్కు 77 సీట్లు రాగా.. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ఆ పార్టీ సంఖ్య 80కి చేరింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







