హైదరాబాదీకి ఒమాన్ దేశ భర్త ఫోన్ ద్వారా తలాఖ్ ఇచ్చిన వైనం

- December 25, 2017 , by Maagulf
హైదరాబాదీకి ఒమాన్ దేశ భర్త ఫోన్ ద్వారా తలాఖ్ ఇచ్చిన వైనం

హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి చెందిన వివాహితకు ఒమన్ దేశానికి చెందిన భర్త ఫోన్ ద్వారా తలాఖ్ ఇచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఎర్రకుంటకు చెందిన గౌసియాబేగంను ఒమన్ దేశానికి చెందిన జహ్రాన్ హమీద్ అల్ రాజి 2008 ఆగస్టు 11వతేదీన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో భార్య గౌసియాకు ఇల్లు నిర్మించి ఇచ్చి పదిలక్షల రూపాయల నగదు ఇస్తానని హామి ఇచ్చాడు. పెళ్లి అనంతరం నెలానెలా డబ్బు పంపిస్తూ అప్పుడప్పుడు వచ్చి పోతుండే జహ్రాన్ ఉన్నట్టుండి ఓ రోజు ఫోన్ చేసి తలాఖ్ చెప్పి ఫోన్ కట్ చేశాడని గౌసియా బేగం దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు ఫిర్యాదు చేసింది. తాను ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని గౌసియా కేంద్రమంత్రిని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com