యూకేలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్.!
- December 26, 2017
యూకేలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్. స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసాలోకి మారడానికి యూకే నిబంధనలను మరింత సరళతరం చేసింది. సరళతరం చేసిన ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు జనవరి 11 నుంచి ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం యూకేలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు తమ కోర్సును పూర్తిచేసుకునే లోపలే టైర్-2 వీసా(స్కిల్డ్ వర్క్ వీసా)లోకి మారిపోవచ్చు.
అయితే ఇప్పటి వరకున్న నిబంధనల్లో టైర్-2 వీసాను విద్యార్థులు పొందాలంటే, కచ్చితంగా వారు డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిగ్రీ పట్టా పొందే దాకా ఆగాల్సి వస్తుండటంతో, అనంతరం విద్యార్థులు ఉద్యోగం వెతుకోవడానికి కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. దీంతో విద్యార్థులు ఉద్యోగం పొందడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సవరించిన నిబంధనల వల్ల కొన్ని నెలలు ముందుగానే విద్యార్థులు టైర్-2 వీసాను దరఖాస్తు చేసుకోవచ్చని ఈవై-యూకే పేర్కొంది.
ప్రస్తుతం చదువుకోవడానికి యూకే వెళ్తున్న విద్యార్థులకు స్టూడెండ్ వీసా(టైర్-4 వీసా)ను కోర్సు కాల వ్యవధితో పాటు 4 నెలల కాలానికి కలిపి ఇస్తున్నారు. కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటం విదేశీ విద్యార్థులు ఉద్యోగం వెతుకోవడాన్ని దెబ్బతీస్తోంది. ఈ లోపల వారు ఉద్యోగం పొందలేకపోతే, విద్యార్థులు తమ స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. అంతేకాక టైర్-4 వీసా నుంచి టైర్-2వీసాల్లోకి మారడం కూడా చాలా క్లిష్టతరంగా ఉంటుంది. ఆ లోపల డిగ్రీ పొందలేకపోతే, స్టూడెంట్ వీసాకు కూడా కాలం చెల్లిపోతుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







