సౌదీ న్యాయమూర్తిని హత్య చేయమని ఫత్వా జారీ చేసిన మతగురువు
- December 30, 2017
రియాద్: ఏ మతం మరో మనిషిని ఖతం చేయమనదు. అటువంటిది ఒక మతగురువు ఏకంగా న్యాయమూర్తిని చంపేయమని ఫత్వా జారీ చేయడంతో పలువురు విస్తుపోయారు. గత ఏడాది 2016 డిసెంబర్లో హత్యకు గురైన న్యాయమూర్తి జిరానీ అవశేషాలు రెండు వారాల క్రితం బయటప డడంతో సంచలనం కల్గింది.. ఇరాన్కు చెందిన ఓ మతగురువు ఆదేశం మేరకు సౌదీకి చెందిన జడ్జీని ఉగ్రవాదులు దారుణంగా అంతమొందించారు. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2016 సంవత్సరంలో అరెస్టైన మహమ్మద్ అల్ జిరానీ అనే సౌదీ న్యాయూమూర్తిని సౌదీఅరేబియాలోని ఖ్వతిఫ్ ఫ్రావిన్స్ ప్రాంతంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అవామియా ప్రాంతంలోని ఓ గృహంలో రెండు రోజులపాటు నిర్భంధించారు. రహస్యంగా జడ్జీని నిర్భంధించేందుకు అవస్థలు పడిన ఉగ్రవాదులు విషయాన్ని ఇరాన్కు చెందిన మతగురువుకు తెలియజేశారు. దీంతో న్యాయమూర్తిని చంపేయాలంటే టెర్రరిస్ట్ సెల్ సభ్యులకు మతగురువు ఫత్వా జారీ చేశారు. అనంతరం ఉగ్రవాదులు న్యాయమూర్తిని హత్య చేశారని అశ్రఖ్ అల్ అస్వత్ అనే పత్రిక పేర్కొంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







