సౌదీ న్యాయమూర్తిని హత్య చేయమని ఫత్వా జారీ చేసిన మతగురువు
- December 30, 2017
రియాద్: ఏ మతం మరో మనిషిని ఖతం చేయమనదు. అటువంటిది ఒక మతగురువు ఏకంగా న్యాయమూర్తిని చంపేయమని ఫత్వా జారీ చేయడంతో పలువురు విస్తుపోయారు. గత ఏడాది 2016 డిసెంబర్లో హత్యకు గురైన న్యాయమూర్తి జిరానీ అవశేషాలు రెండు వారాల క్రితం బయటప డడంతో సంచలనం కల్గింది.. ఇరాన్కు చెందిన ఓ మతగురువు ఆదేశం మేరకు సౌదీకి చెందిన జడ్జీని ఉగ్రవాదులు దారుణంగా అంతమొందించారు. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2016 సంవత్సరంలో అరెస్టైన మహమ్మద్ అల్ జిరానీ అనే సౌదీ న్యాయూమూర్తిని సౌదీఅరేబియాలోని ఖ్వతిఫ్ ఫ్రావిన్స్ ప్రాంతంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అవామియా ప్రాంతంలోని ఓ గృహంలో రెండు రోజులపాటు నిర్భంధించారు. రహస్యంగా జడ్జీని నిర్భంధించేందుకు అవస్థలు పడిన ఉగ్రవాదులు విషయాన్ని ఇరాన్కు చెందిన మతగురువుకు తెలియజేశారు. దీంతో న్యాయమూర్తిని చంపేయాలంటే టెర్రరిస్ట్ సెల్ సభ్యులకు మతగురువు ఫత్వా జారీ చేశారు. అనంతరం ఉగ్రవాదులు న్యాయమూర్తిని హత్య చేశారని అశ్రఖ్ అల్ అస్వత్ అనే పత్రిక పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







