సౌదీ న్యాయమూర్తిని హత్య చేయమని ఫత్వా జారీ చేసిన మతగురువు
- December 30, 2017_1514672849.jpg)
రియాద్: ఏ మతం మరో మనిషిని ఖతం చేయమనదు. అటువంటిది ఒక మతగురువు ఏకంగా న్యాయమూర్తిని చంపేయమని ఫత్వా జారీ చేయడంతో పలువురు విస్తుపోయారు. గత ఏడాది 2016 డిసెంబర్లో హత్యకు గురైన న్యాయమూర్తి జిరానీ అవశేషాలు రెండు వారాల క్రితం బయటప డడంతో సంచలనం కల్గింది.. ఇరాన్కు చెందిన ఓ మతగురువు ఆదేశం మేరకు సౌదీకి చెందిన జడ్జీని ఉగ్రవాదులు దారుణంగా అంతమొందించారు. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2016 సంవత్సరంలో అరెస్టైన మహమ్మద్ అల్ జిరానీ అనే సౌదీ న్యాయూమూర్తిని సౌదీఅరేబియాలోని ఖ్వతిఫ్ ఫ్రావిన్స్ ప్రాంతంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అవామియా ప్రాంతంలోని ఓ గృహంలో రెండు రోజులపాటు నిర్భంధించారు. రహస్యంగా జడ్జీని నిర్భంధించేందుకు అవస్థలు పడిన ఉగ్రవాదులు విషయాన్ని ఇరాన్కు చెందిన మతగురువుకు తెలియజేశారు. దీంతో న్యాయమూర్తిని చంపేయాలంటే టెర్రరిస్ట్ సెల్ సభ్యులకు మతగురువు ఫత్వా జారీ చేశారు. అనంతరం ఉగ్రవాదులు న్యాయమూర్తిని హత్య చేశారని అశ్రఖ్ అల్ అస్వత్ అనే పత్రిక పేర్కొంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక