హింసాత్మకంగా మారిన ఇరాన్ నిరసనలు
- December 30, 2017ఇరాన్లోని పలు నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. కొన్ని నగరాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయని వీడియో దృశ్యాలు చూపుతున్నాయి. దిగజారుతున్న జీవన ప్రమాణాలకు నిరసనగా మూడు రోజుల కిందట ఇరాన్లో ప్రజల ఆందోళనలు మొదలయ్యాయి. దేశంలో సంస్కరణలు కోరుతూ 2009లో జరిగిన ఆందోళనల తర్వాత మళ్లీ ఇప్పుడు భారీ స్థాయిలో నిరసనలు చెలరేగాయి.
‘‘చట్టవ్యతిరేకంగా గుమికూడవద్దు’’ అంటూ ఇరాన్ హోంమంత్రి చేసిన హెచ్చరికలను ఆందోళనకారులు పట్టించుకోలేదు. దోరుద్ పట్టణంలో ఇద్దరు నిరసనకారులు కాల్పుల్లో చనిపోయినట్లు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో చూపుతోంది. ఇతర ప్రాంతాల్లో ఆందోళనకారులు పోలీసు వాహనాలను దగ్ధం చేస్తున్న దృశ్యాలు మరికొన్ని వీడియోల్లో కనిపించాయి. ప్రభుత్వ భవనాలపైనా నిరసనకారులు దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం