రజనీ పొలిటికల్ ఎంట్రీ పై ప్రకటన..!
- December 30, 2017
దేవుడు శాసించాడు. రజనీ పాటించాడు. కొన్నేళ్లుగా రజనీ పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న చర్చకు ఆన్సర్ దొరకింది. అభిమానులతో ఆయన మాట్లాడుతూ.. పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నిల్లోపే సొంతంగా కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. తమిళనాడులోని 234 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. యుద్ధం చేస్తా, గెలుపోటములు దేవుడి దయ అని వ్యాఖ్యానించారు. యుద్ధం చేయకపోతే పిరికివాడు అంటారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం నేను ఇప్పుడు తీసుకోకపోతే పెద్ద తప్పు చేసినవాడినవుతాను. రాజకీయాలు నాకు కొత్తేం కాదు. 1996లోనే నేను రాజకీయాల్లో ఉన్నాను అన్నారు.రాజకీయాల్లో వస్తున్నానని రజనీకాంత్ ప్రకటించడంతో అభిమానులు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు చేశారు.
తాజా వార్తలు
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..







