కిటకిటలాడుతున్న దుబాయ్ మాల్స్
- December 31, 2017_1514733945.jpg)
దుబాయ్: గత ఏడాది భారతదేశంలో వెయ్యి , అయిదు వందల రూపాయల నోట్లు రద్దు అవుతుంటే ప్రజలు పలు బ్యాంకుల ముందు ఎలా బారులు తీరారో అలానే దుబాయ్ లో గత రెండు రోజులుగా నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాల ముందు కిక్కిరిసి ఉన్నారు. రేపు జనవరి 1 వ తేదీ నుంచి విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ ) అమలవుతున్న నేపథ్యంలో సాధ్యమైనన్ని సరుకులు కొనుగోలు చేయడం మంచిదని నిత్యావసరాలు నిల్వ చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడంతో పలువురు వినియోగదారులు దుకాణాలవైపు పరుగులుతీస్తున్నారు. రొట్టెలు పాలు పండ్లు కూరగాయలు తదితర ఆహారవస్తువులపై 75 శాతం డిస్కౌంట్ ఉందని వారు చెబుతున్నారు. జనవరి 1 నుంచి ప్రభుత్వం వ్యాట్ అమలుచేయబోతోందని దాంతో ఇంత కారుచౌకగా సరుకులు లభ్యం కావని వారు చెప్పారు. అయితే ప్రజలు ఎక్కువగా ఎల్ ఇ డి టీవీలు .. మైక్రో ఓవెన్లు ...వాషింగ్ మెషీన్లు..రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైపర్ మార్కెట్స్ నుంచి చిన్న షాపింగ్ మాల్ అన్ని వినియోగదారులతో కిటకిటలాడిపోతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి