కిమ్ జోంగ్ పై ట్రంప్ ఫైర్
- January 03, 2018
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ పిచ్చి పైత్యానికెక్కింది. ప్రపంచమంతా న్యూఇయర్ వేడుకల్లో మునిగి ఉంటే నా టేబుల్పై అణు బాంబు బటన్ ఉంది. నా వేలు దానిపైనే ఉంది. ఎప్పుడైనా దాన్ని ప్రెస్ చేసేస్తాను అంటూ అమెరికాను టార్గెట్ చేస్తున్నాడు. అయితే అగ్ర రాజ్య అధినేత ట్రంప్ కూడా కిమ్కి ధీటుగానే సమాధానం చెబుతున్నాడు. నాదగ్గర కూడా అంతకంటే శక్తి వంతమైన అణు బాంబు ఉంది అని అంటున్నాడు. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అణు ప్రయోగాల విషయమై అనేక సార్లు బహిరంగంగానే హెచ్చరికలు చేసుకున్నారు.
ఇటీవల అమెరికా మిలిటరీ మాజీ చీఫ్ ఉత్తరకొరియాకు యుద్ధానికి సిద్దంగా ఉన్నామంటూ మెసేజ్ కూడా పంపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ఉత్తర కొరియాపై రగిలిపోతోంది. యుద్ధ సంకేతాలు పంపుతోందని యూఎస్ జాయింట్ చీఫ్ మాజీ ఛైర్మన్ మైక్ ముల్లెన్ అన్నారు. ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించారు ట్రంప్. ఉత్తర కొరియాని మట్టుపెట్టడం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ హెచ్చరికలకు కిమ్ ఏమీ కామ్గా లేడు. గత ఏడాది నవంబర్లో ఆ దేశం అత్యంత శక్తివంతమైన క్షిపణిని అమెరికాపై ప్రయోగించింది. దీంతో ఆగేది లేదు. ముందు ముందు మా తడాఖా ఇంకా చూపిస్తామంటోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







