మహేష్ బాబు సరసన పూజా హెగ్డే
- January 03, 2018
స్పైడర్ సినిమాతో విజయం అందుకున్న మహేశ్బాబు భరత్ అను నేను అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి సినిమాకు అంగీకరించాడు. అయితే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మహేశ్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. పూజా హెగ్డే గతంలో దువ్వాడ జగన్నాథం (డిజే), ముకుంద సినిమాల్లో నటించింది. డీజేలోనైతే అందచందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీ వాసు దర్శకత్వంలో తీస్తున్న సినిమాలో నటిస్తోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ సినిమాను హిట్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అల్లరి నరేశ్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. భారీగా తెరకెక్కబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
త్వరలో ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర బృందం.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







