తెలంగాణ ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్
- January 03, 2018





కతార్: తెలంగాణ చాంపియన్స్ లీగ్, ప్రతి సంవత్సరం జరిగే ఈ ప్రఖ్యాత క్రికెట్ టోర్నమెంట్, కతర్ ఫౌండేషన్ క్రికెట్ గ్రౌండ్స్ (శుక్రవారం) లో శుక్రవారం డిసెంబర్ 29 తేదీన కతర్ లో ముగిసింది. దీని 3 వ ఎడిషన్లో మొత్తం 12 జట్లు ఈ టోర్నమెంట్లో 4 వారాల పాటు పాల్గొన్నాయి.శుక్రవారం ఆడిన గ్రాండ్ ఫినాలేలో Navayuga,Qatar మరియు KCR Warriors టైటిల్ కోసం పోరాడారు. తొలుత నవయుగ జట్టు 12 ఓవర్లలో 78 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కి దిగిన KCR Warriors జట్టు 10.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్నిఛేదించి విజేతగా నిలిచింది. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ మిస్టర్ ఓమర్ మరియు ది మ్యాన్ ఆఫ్ ది సీరీస్గా మిస్టర్ జబీర్ KCR Warriors నుండి అందుకున్నారు. ఈ సమయంలో టోర్నమెంట్ యొక్క ముఖ్యాంశాలు కిడ్స్ కోసం క్రికెట్ మ్యాచ్లు మరియు ఆడవారి కోసం గేమ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నిలంగ్షూ దేవ్, అధ్యక్షుడు ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ (ISC) క్రీడాకారులకు తన శుభాకాంక్షలను అందించారు. మరియు స్పోర్ట్స్మన్షిప్ యొక్క ప్రాముఖ్యతను వివరించారుచారు. సంస్కృతి మరియు సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాకుండా స్పోర్ట్స్ ప్రోత్సహించడానికి TPS- కతర్ చేస్తున్న కార్యక్రమాల్నిప్రశంసించారు. ISC క్రికెట్ హెడ్ చైర్మన్ అజిమ్ అబ్బాస్ కూడా ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో దివాకర్ పూజరి, మణికంటన్ ఎపి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ సాంస్కృతిక కేంద్రం మహేష్ గౌడ, ప్రధాన కార్యదర్శి, ఐసిబిఎఫ్, సుబ్రమణ్య హెబ్బెగెలు, రవి కిషోర్ పాల్గొన్నారు. టోర్నమెంట్కు అవార్డులను ఇవ్వడానికి ముందుగా అన్ని అతిథులు టోర్నమెంట్ యొక్క నిర్వాహకులను ప్రశంసించారు. అనంతరం టిపిఎస్ ఖతార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారి కార్యదర్శులు శంకర్ గౌడ్, రమేష్ పిట్లా, అంజయ్య వాట్టెమాల, శోభన్, తిరుపతి యాదవ్ మరియు ప్రత్యేకించి జట్ల కెప్టెన్లు, ఆటగాళ్ళకు ధన్యవాదాలు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









