నైజీరియా మసీదులో ఆత్మాహుతి దాడి 11 మంది మృతి
- January 03, 2018
అబూజ : బోర్నో రాష్ట్రంలో గాంబౌరు నగరంలోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది.ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...బుధవారం తెల్లవారుజామున గాంబౌరు నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో ప్రార్థన చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. మృతదేహాలన్నీ మసీదు ఆవరణలో చల్లాచదురైపడిపోయాయి.
భారీ పేలుడు కారణంగా పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. మసీదు భవనం తునాతునకలైంది. మసీదు శిధిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండివుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో ముమ్మర సహాయక చర్యలు చేపట్టామని అన్నారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా, గతవారం మైదుగురీ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు పౌరులు మృతి చెందారు.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు బోకో హారమ్ మిలిటెంట్లు ప్రకటించుకున్నారు. గతేడాది నవంబర్లో నైజీరియా మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 50 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







