చోరీకి గురైన అత్యంత ఖరీదైన మద్యం సీసా
- January 04, 2018
డెన్మార్క్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసా చోరీకి గురైంది. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రూసో బాల్టీక్ అనే వోడ్కా బాటిల్ ఖరీదు 1.3 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.8.2 కోట్లు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసాగా దీనికి గుర్తింపు ఉంది.
ఈ మద్యం సీసాను మూడు కిలోల బంగారం, వెండితో తయారుచేశారు. సీసా మూతను వజ్రంతో తయారుచేశారు. కోపెన్హాగెన్లోని 33 కెఫె అనే బార్లో ఈ సీసాను ప్రదర్శనకు ఉంచారు. బార్లోని సీసీటీవీ ఫుటేజ్లో ఓ వ్యక్తి టోపీతో వచ్చి ఈ సీసాను దొంగిలించినట్లు రికార్డ్ అయింది. ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు అక్కడి పోలీసులు యత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







