చోరీకి గురైన అత్యంత ఖరీదైన మద్యం సీసా
- January 04, 2018
డెన్మార్క్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసా చోరీకి గురైంది. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రూసో బాల్టీక్ అనే వోడ్కా బాటిల్ ఖరీదు 1.3 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.8.2 కోట్లు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసాగా దీనికి గుర్తింపు ఉంది.
ఈ మద్యం సీసాను మూడు కిలోల బంగారం, వెండితో తయారుచేశారు. సీసా మూతను వజ్రంతో తయారుచేశారు. కోపెన్హాగెన్లోని 33 కెఫె అనే బార్లో ఈ సీసాను ప్రదర్శనకు ఉంచారు. బార్లోని సీసీటీవీ ఫుటేజ్లో ఓ వ్యక్తి టోపీతో వచ్చి ఈ సీసాను దొంగిలించినట్లు రికార్డ్ అయింది. ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు అక్కడి పోలీసులు యత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







