చోరీకి గురైన అత్యంత ఖరీదైన మద్యం సీసా
- January 04, 2018
డెన్మార్క్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసా చోరీకి గురైంది. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రూసో బాల్టీక్ అనే వోడ్కా బాటిల్ ఖరీదు 1.3 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.8.2 కోట్లు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసాగా దీనికి గుర్తింపు ఉంది.
ఈ మద్యం సీసాను మూడు కిలోల బంగారం, వెండితో తయారుచేశారు. సీసా మూతను వజ్రంతో తయారుచేశారు. కోపెన్హాగెన్లోని 33 కెఫె అనే బార్లో ఈ సీసాను ప్రదర్శనకు ఉంచారు. బార్లోని సీసీటీవీ ఫుటేజ్లో ఓ వ్యక్తి టోపీతో వచ్చి ఈ సీసాను దొంగిలించినట్లు రికార్డ్ అయింది. ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు అక్కడి పోలీసులు యత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









