ఆర్మీ వెల్ఫేర్ కు రూ. 5 లక్షల అందజేయనున్న అర్చర్ జ్యోతి సురేఖ
- January 04, 2018కష్టపడి ఎదిగిన వ్యక్తి.. అవతలి వారి కష్టంలో ఉంటే ఆదుకోవాలి అనే ఆలోచన వస్తుంది.. ఎందుకంటే కష్టం బాధతెలుసు కనుక.. ఎంతో కష్టపడి పైకి వచ్చిన అర్చర్ జ్యోతి తన పెద్దమనసును చాటుకొన్నది. తనకు అర్జున అవార్డ్ తో పాటు వచ్చిన నగదు పురష్కారం రూ. 5 లక్షలను ఆర్మీ వెల్ఫేర్ కు అందజేయనున్నట్లు ఆమె తెలిపింది. ఆర్మీ వెల్ఫేర్ కు ఎందుకు ఇస్తున్నానంటే.. మన కోసం.. మనల్ని మన దేశాన్ని రక్షించడం కోసం.. అహర్నిశలు సరిహద్దుల్లో కాపలా ఉండి.. ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న ఆర్మీ వారికి ఇవ్వాలనే ఆలోచనవచ్చిందని జ్యోతి సురేఖ తెలిపారు. ప్రధాని మోడీ ఎప్పుడు ఆపాయింట్ మెంట్ ఇస్తే అప్పుడు ఈ చెక్ ను తాను అందజేస్తానని ఆమె చెప్పారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా మంది సహాయం చేశారని.. తనకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. ఉద్యోగం ఇస్తానని ప్రకటించింది అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. కాగా ఇప్పటికే అక్షయ్ కుమార్, సింధు, గౌతమ్ గంభీర్ వంటి వారు ఆర్మీ కుటుంబాలను ఆడుకోవడానికి ముందుకొచ్చారు అన్న సంగతి తెలిసిందే..
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు