ఆర్మీ వెల్ఫేర్ కు రూ. 5 లక్షల అందజేయనున్న అర్చర్ జ్యోతి సురేఖ
- January 04, 2018కష్టపడి ఎదిగిన వ్యక్తి.. అవతలి వారి కష్టంలో ఉంటే ఆదుకోవాలి అనే ఆలోచన వస్తుంది.. ఎందుకంటే కష్టం బాధతెలుసు కనుక.. ఎంతో కష్టపడి పైకి వచ్చిన అర్చర్ జ్యోతి తన పెద్దమనసును చాటుకొన్నది. తనకు అర్జున అవార్డ్ తో పాటు వచ్చిన నగదు పురష్కారం రూ. 5 లక్షలను ఆర్మీ వెల్ఫేర్ కు అందజేయనున్నట్లు ఆమె తెలిపింది. ఆర్మీ వెల్ఫేర్ కు ఎందుకు ఇస్తున్నానంటే.. మన కోసం.. మనల్ని మన దేశాన్ని రక్షించడం కోసం.. అహర్నిశలు సరిహద్దుల్లో కాపలా ఉండి.. ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న ఆర్మీ వారికి ఇవ్వాలనే ఆలోచనవచ్చిందని జ్యోతి సురేఖ తెలిపారు. ప్రధాని మోడీ ఎప్పుడు ఆపాయింట్ మెంట్ ఇస్తే అప్పుడు ఈ చెక్ ను తాను అందజేస్తానని ఆమె చెప్పారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా మంది సహాయం చేశారని.. తనకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. ఉద్యోగం ఇస్తానని ప్రకటించింది అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. కాగా ఇప్పటికే అక్షయ్ కుమార్, సింధు, గౌతమ్ గంభీర్ వంటి వారు ఆర్మీ కుటుంబాలను ఆడుకోవడానికి ముందుకొచ్చారు అన్న సంగతి తెలిసిందే..
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..