టొరంటో:ఎయిర్పోర్ట్లో ఢీకొన్న రెండు విమానాలు
- January 05, 2018
టొరంటో: కెనడాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. టొరంటో విమానాశ్రయంలోనే ఈ ఘటన జరిగింది. అసలే దట్టమైన మంచుతో వణికిపోతున్న ప్రయాణికులకు.. విమానాలు ఢీకొన్న ఘటన మరింత భయభ్రాంతులకు గురిచేసింది. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. వెస్ట్జెట్కు చెందిన విమానం మెక్సికో నుంచి టొరంటోకు చేరుకున్నది. ఆ విమానంలో సుమారు 168 మంది ప్యాసింజెర్లు ఉన్నారు. ఎయిర్పోర్ట్లోని గేటు వద్ద సన్వింగ్ సంస్థ విమానం వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వెస్ట్జెట్ విమానాన్ని ఢీకొట్టింది. అయితే రెండు విమానాలు ఢీకొనగానే, ఓ విమానం నుంచి మంటలు వ్యాపించాయి. వెస్ట్జెట్ విమానంలో ఉన్న ప్రయాణికులను వెంటనే దించేశారు. ఎమర్జెన్సీ ైస్లెడ్స్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సన్వింగ సంస్థ విమానంలో మాత్రం ప్రమాద సమయంలో ఎవరూ లేరు. ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు కెనడా విమానశాఖ పేర్కొన్నది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







