సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది బంగ్లాదేశ్ కార్మికులు మృతి

- January 07, 2018 , by Maagulf
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8  మంది బంగ్లాదేశ్ కార్మికులు మృతి

సౌదీ అరేబియా :   23 మంది కార్మికులతో  వెళ్తోన్న ఒక బస్సుని ను ఎదురుగా వస్తున్నా మరో భారీ వాహనం ఢీ కొట్టిన దుర్ఘటనలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు పేర్కొన్నారు. .జిజాన్ నగర ప్రాంతంలోని అల్ హర్హ రోడ్డుపై శనివారం ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు వివరించారు. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన 15 మందిని ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు  ఒక ప్రయివేటు కంపెనీకి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. బస్సులో  ప్రయాణికులందరూ అదే కంపెనీ కార్మికులని వారు చెబుతున్నారు. అందరూ బంగ్లాదేశ్‌కు చెందినవారని పోలీసులు చెప్పారు. బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయంకు సైతం  సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com