సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది బంగ్లాదేశ్ కార్మికులు మృతి
- January 07, 2018
సౌదీ అరేబియా : 23 మంది కార్మికులతో వెళ్తోన్న ఒక బస్సుని ను ఎదురుగా వస్తున్నా మరో భారీ వాహనం ఢీ కొట్టిన దుర్ఘటనలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు పేర్కొన్నారు. .జిజాన్ నగర ప్రాంతంలోని అల్ హర్హ రోడ్డుపై శనివారం ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు వివరించారు. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన 15 మందిని ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఒక ప్రయివేటు కంపెనీకి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. బస్సులో ప్రయాణికులందరూ అదే కంపెనీ కార్మికులని వారు చెబుతున్నారు. అందరూ బంగ్లాదేశ్కు చెందినవారని పోలీసులు చెప్పారు. బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంకు సైతం సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







