మెక్సికోలో కాల్పుల కలకలం - 11 మంది మృతి

- January 08, 2018 , by Maagulf
మెక్సికోలో కాల్పుల కలకలం - 11 మంది మృతి

వాషింగ్టన్: మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఎకాపల్కో రిసార్ట్‌లైన్‌ వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతిచెందారు. మృతుల్లో 8 మంది స్థానికులు, ముగ్గురు సీఆర్‌ఏసీ గ్రూప్‌ మిలిటెంట్లు ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటార్నీ జనరల్‌ జేవియర్‌ ఓలియా పేలెజ్‌ తెలిపిన వివరాల ప్రకారం...మెక్సికోలోని ఎకాపల్కో రిసార్ట్‌ టౌన్‌కు సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ రిసార్టులోకి కొంతమంది దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. స్థానికులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 8 మంది కాలనీవాసులు చనిపోయారు. సమాచారం అందుకున్న సీఆర్‌ఏసీ మిలిటెంట్లు ఘటనాస్థలికి చేరుకున్నారు. రిసార్ట్‌ టౌన్‌ను చుట్టుముట్టి దుండగులపై కాల్పులు జరిపారు. దుండగులు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందారు. సామాజిక మాధ్యమాల కాల్పుల ఉదంతం సమాచారం తెలుసుకున్న మెక్సికో ఆర్మీ, ఫెడరల్‌, స్టేట్‌ బలగాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. రిసార్ట్‌లో తలదాచుకున్న దుండగులను, మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నాయి. ఘటనాస్థలంలో లభ్యమైన మారణాయుధాలు, తుపాకులు, బాంబులను స్వాధీనం చేసుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com