పోలవరం-పట్టిసీమ ప్రాజెక్టులు సందర్శించిన ప్రవాసులు
- January 08, 2018




ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో 12దేశాల నుండి వచ్చిన ప్రవాసాంధ్ర బృందం సోమవారం నాడు పోలవరం-పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించింది. ఈ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరు రమేష్బాబు, ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనులను గురించి ఎన్నారై బృందానికి వివరించారు. అంతకుముందు తాటిపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బృందంతో భేటీ అయ్యారు. ఏపీ ఎన్ఆర్టీ బృందం చేపట్టిన స్మాష్ & ట్రాష్ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నామని, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రుల కోసం ప్రత్యేక పథకాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రవాసాంధ్రులకు అవసరమైన అన్ని రకాల సేవలను ఏపీ ఎన్ఆర్టీ ద్వారా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. జన్మభూమి పథకంలో ప్రవాసాంధ్రులు విరివిగా పాల్గొని తమ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని బాబు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం దేవరపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముళ్లపూడి వెంకటరావు మంచి విందును ఏర్పాటును చేసి ప్రవాసులకు గోదావరి రుచులను చవిచూపించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్ఆర్టీ సీఈఓ డా.వేమూరు రవికుమార్, కలపటు బుచ్చిరాంప్రసాద్, మేడి మాధవి, డీవీ రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







