బహ్రెయిన్‌లో వలసకార్మికుడి నిరీక్షణకు తెర

- January 08, 2018 , by Maagulf
బహ్రెయిన్‌లో వలసకార్మికుడి నిరీక్షణకు తెర

మనామా: భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్‌లో చిక్కుకుపోయారు. తన తండ్రి మరణం నేపథ్యంలో స్వదేశానికి రావాల్సి ఉన్నా స్పాన్సరర్‌ నుంచి అనుమతి లభించలేదు ఇప్పటిదాకా. ఎట్టకేలకు స్పాన్సరర్‌ నుంచి అనుమతి రావడం, పాస్‌పోర్ట్‌ అందడంతో ఆ వ్యక్తి స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. నవంబర్‌ 24న, రాజేష్‌ తండ్రి మరణించారు. ఎట్టకేలకు రాజేష్‌ నిరీక్షణకు తెరపడిందని, రాజేష్‌ కుటుంబం బహ్రెయిన్‌ నుంచి స్వదేశానికి చేరుకుంటుందని ఆయన సన్నిహితులు చెప్పారు. బహ్రెయిన్‌లో ఇండియన్‌ రాయబారి అలోక్‌ కుమార్‌కు రాజేష్‌ కృతజ్ఞతలు తెలిపారు. తనకు సాయం చేసినవారిలో మైగ్రెంట్‌ వర్కర్స్‌ అసిస్టెన్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ సెకెండ్‌ సెక్రెటరీ ఫయీజా ఖాన్‌కి కూడా కృతజ్ఞతలు చెప్పారు రాజేష్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com