టూ స్టేట్స్ లో 'శివానీ' సందడి చేయబోతోందా..!!
- January 09, 2018
ఈ మధ్య నటుల కుమార్తెలు కూడా తెరంగేట్రం చేస్తున్నారు. ఇది కాస్త బాలీవుడ్లో ఎక్కువే అయినా ఇప్పడు టాలీవుడ్లో కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటికే మెగా ప్యామిలీ నుంచి వచ్చిన నాగబాబు కుమార్తె నీహారిక అటు బుల్లి తెర, ఇటు వెండి తెరపై సందడి చేస్తూ అభిమానుల్ని సంపాదించుకుంటోంది. అదే బాటలో రాజశేఖర్ తనయ కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎప్పట్నించో వార్తల్లో నానుతున్నా మంచి పాత్ర కోసం వేచి చూస్తున్నట్టుంది. ఇప్పుడు ముహూర్తం ఖరారైంది. బాలీవుడ్లో విజయవంతమైన 'టు స్టేట్స్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అడవి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. వెంకట్ కుంచె దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో అలియాభట్ కథానాయికగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. మరి తెలుగులో నటిస్తున్న శివానీకి ఎన్ని మార్కులు వస్తాయో చూడాలి. రాజశేఖర్ దంపతులు కూడా బాగా చదివేస్తున్నారు స్క్రిప్ట్ని. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేయాలంటే ఆ మాత్రం కసరత్తు చేయక తప్పదు మరి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







