యూఏఈ ట్రాఫిక్ ప్రోగ్రామ్స్: 668 మోటరిస్టులకు ఊరట
- January 09, 2018
యూఏఈ:అబుదాబీ పోలీసులు నిర్వహించిన ట్రాఫిక్ ప్రోగ్రామ్స్ ద్వారా, 668 మంది మోటరిస్టులు ఊరట పొందారు. ఇందులో కొందరు తమ లైసెన్సుల్ని తిరిగి పొందగా, మరికొందరు బ్లాక్ పాయింట్స్ని తగ్గించుకోగలిగారు. 87 మందికి బ్లాక్ పాయింట్స్ తగ్గాయని, 681 మంది మోటరిస్టులు తమ లైసెన్సుల్ని తిరిగి పొందారని అబుదాబీ పోలీసులు వెల్లడించారు. అబుదాబీ ట్రాఫిక్ మరియు పెట్రోల్ డైరెక్టరేట్, అలాగే ట్రాఫిక్ కౌన్సిల్ అల్ అయిన్లో మూడు నెలలపాటు 133 ప్రోగ్రామ్స్ని నిర్వహించారు. పోలీస్ ఫాలో అప్ డిపార్ట్మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ ఒబైద్ అల్ ఖైలి మాట్లాడుతూ, ఈ ప్రోగ్రామ్స్ ట్రాఫిక్ కల్చర్ని పెంపొందించాయనీ, అలాగే పాజిటివ్ రోడ్ హ్యాబిట్స్ని వాహనదారుల్లో పెంపొందించాయని చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారు ఈ ప్రోగ్రామ్స్కి హాజరవ్వాల్సి ఉందని లేని పక్షంలో వాహనాల్ని సీజ్ చేయాల్సి ఉంటుందని ట్రాఫిక్ పాయింట్స్ రిడక్షన్ సెక్షన్ హెడ్ మేజర్ అహ్మద్ జుమా అల్ ఖైయిలి చెప్పారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..







