యూఏఈ ట్రాఫిక్ ప్రోగ్రామ్స్: 668 మోటరిస్టులకు ఊరట
- January 09, 2018
యూఏఈ:అబుదాబీ పోలీసులు నిర్వహించిన ట్రాఫిక్ ప్రోగ్రామ్స్ ద్వారా, 668 మంది మోటరిస్టులు ఊరట పొందారు. ఇందులో కొందరు తమ లైసెన్సుల్ని తిరిగి పొందగా, మరికొందరు బ్లాక్ పాయింట్స్ని తగ్గించుకోగలిగారు. 87 మందికి బ్లాక్ పాయింట్స్ తగ్గాయని, 681 మంది మోటరిస్టులు తమ లైసెన్సుల్ని తిరిగి పొందారని అబుదాబీ పోలీసులు వెల్లడించారు. అబుదాబీ ట్రాఫిక్ మరియు పెట్రోల్ డైరెక్టరేట్, అలాగే ట్రాఫిక్ కౌన్సిల్ అల్ అయిన్లో మూడు నెలలపాటు 133 ప్రోగ్రామ్స్ని నిర్వహించారు. పోలీస్ ఫాలో అప్ డిపార్ట్మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ ఒబైద్ అల్ ఖైలి మాట్లాడుతూ, ఈ ప్రోగ్రామ్స్ ట్రాఫిక్ కల్చర్ని పెంపొందించాయనీ, అలాగే పాజిటివ్ రోడ్ హ్యాబిట్స్ని వాహనదారుల్లో పెంపొందించాయని చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారు ఈ ప్రోగ్రామ్స్కి హాజరవ్వాల్సి ఉందని లేని పక్షంలో వాహనాల్ని సీజ్ చేయాల్సి ఉంటుందని ట్రాఫిక్ పాయింట్స్ రిడక్షన్ సెక్షన్ హెడ్ మేజర్ అహ్మద్ జుమా అల్ ఖైయిలి చెప్పారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







