యూఏఈ ట్రాఫిక్ ప్రోగ్రామ్స్: 668 మోటరిస్టులకు ఊరట
- January 09, 2018
యూఏఈ:అబుదాబీ పోలీసులు నిర్వహించిన ట్రాఫిక్ ప్రోగ్రామ్స్ ద్వారా, 668 మంది మోటరిస్టులు ఊరట పొందారు. ఇందులో కొందరు తమ లైసెన్సుల్ని తిరిగి పొందగా, మరికొందరు బ్లాక్ పాయింట్స్ని తగ్గించుకోగలిగారు. 87 మందికి బ్లాక్ పాయింట్స్ తగ్గాయని, 681 మంది మోటరిస్టులు తమ లైసెన్సుల్ని తిరిగి పొందారని అబుదాబీ పోలీసులు వెల్లడించారు. అబుదాబీ ట్రాఫిక్ మరియు పెట్రోల్ డైరెక్టరేట్, అలాగే ట్రాఫిక్ కౌన్సిల్ అల్ అయిన్లో మూడు నెలలపాటు 133 ప్రోగ్రామ్స్ని నిర్వహించారు. పోలీస్ ఫాలో అప్ డిపార్ట్మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ ఒబైద్ అల్ ఖైలి మాట్లాడుతూ, ఈ ప్రోగ్రామ్స్ ట్రాఫిక్ కల్చర్ని పెంపొందించాయనీ, అలాగే పాజిటివ్ రోడ్ హ్యాబిట్స్ని వాహనదారుల్లో పెంపొందించాయని చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారు ఈ ప్రోగ్రామ్స్కి హాజరవ్వాల్సి ఉందని లేని పక్షంలో వాహనాల్ని సీజ్ చేయాల్సి ఉంటుందని ట్రాఫిక్ పాయింట్స్ రిడక్షన్ సెక్షన్ హెడ్ మేజర్ అహ్మద్ జుమా అల్ ఖైయిలి చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి