టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూలు ప్రకటన
- January 10, 2018
ముంబయి:విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్తో ట్వంటీ20 సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్తో సిరీస్ కంటే ముందుగానే భారత జట్టు ఐర్లాండ్కు బయలుదేరనుందని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) వెల్లడించింది. ఈ మేరకు బుధవారం బీసీసీఐ పాలక మండలి ఐర్లాండ్ పర్యటన షెడ్యూలు ఖరారు చేసింది. డబ్లిన్ వేదికగా రెండు టీ20లు జరగనున్నాయి. జూన్ 27న తొలి టీ20, 29న రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా, ఐర్లాండ్ జట్లు తలపడతాయి. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరీ ఓ ప్రకటన విడుదల చేశారు.
జూలైలో ఇంగ్లండ్ పర్యటన ఉండగా, అంతకు కొన్ని రోజుల ముందు భారత జట్టు ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఐర్లాండ్, భారత్ జట్లు పొట్టి ఫార్మాట్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో తలపడ్డాయి. 2009 ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భాగంగా నాటింగ్హామ్లో ఈ జట్లు తలపడ్డ తర్వాత దాదాపు 9 ఏళ్లకు మరోసారి ఎదురపడనున్నాయి. అయితే భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఇప్పటివరకూ జరగలేదు.
భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇటీవల జరిగిన కేప్టౌన్ టెస్టులో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. రెండో టెస్టులో విజయంతో సిరీస్లో బోణీ కొట్టాలని కోహ్లీ సేన భావిస్తోంది.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ న్యూక్లియర్ సైన్స్ ఒలింపియాడ్–2026కు సౌదీ ఆతిథ్యం..!!
- ఒమన్లో 28 మంది ఆసియన్లు అరెస్ట్..!!
- 120 డేస్ సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలి.. కువైట్లో కొత్త చట్టం..!!
- సిమ్ కార్డుల కొనుగోలుపై బహ్రెయిన్ పోలీసుల వార్నింగ్..!!
- ప్రపంచ ఇంటెలిజెంట్ సిటీస్ జాబితాలో దోహా..!!
- ఏసీఐ వరల్డ్ లెవల్-5 అక్రెడిటేషన్ సాధించిన జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం
- హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం...
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్తో మరింత విస్తరించనున్న రవాణా వ్యవస్థ..
- ఆపదలో ఉన్న వేలాది మందికి అండగా GDRFA దుబాయ్..
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..







