కేరళ సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు
- January 11, 2018
దిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. ఎస్ఎన్సీ-లావలిన్ అవినీతి కేసులో ఆయనకు నోటీసులు పంపింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విషయంలో సీబీఐ చేసిన అప్పీల్ను వినడానికి అంగీకరించింది. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం జోక్యం అవసరమని, నిందితులందరికీ నోటీసులు పంపాలని సీబీఐ తరపు న్యాయవాది.. అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరారు. సీబీఐ చేసిన అప్పీలును అంగీకరించిన కోర్టు నాలుగు వారాల్లోగా స్పందించాలని నిందితులకు నోటీసులు పంపింది.
కేరళలోని మూడు హైడ్రోఎలక్ర్టిక్ ప్రాజెక్టుల పునర్నిర్మాణ పనులకు సంబంధించి కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు, కెనడాకు చెందిన ఎస్ఎన్సీ లావలిన్ కంపెనీల మధ్య ఒప్పందాలు, లావాదేవీల విషయంలో అనినీతి జరిగిందని కేసు నమోదైంది.
ఈ కేసులో విజయన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కేరళ హైకోర్టు విజయన్ వదిలేయడంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







