ఒమన్ నుండి భారతదేశం, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఛార్జీలలో డిస్కౌంట్ ను పొందండి
- January 12, 2018మస్కట్ : ఒమాన్ నుంచి భారతదేశానికి వచ్చే అన్నిఇండియన్ ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్ లలో 20 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎయిర్లైన్ ప్రకటించింది. దీని ప్రకారం, జనవరి 15, 2018 తర్వాత నాటి నుండి ప్రయాణీకులు బుకింగ్ లను చేసుకోవచ్చు. ఒమన్ నుండి భారతదేశం మరియు బ్యాంకాక్, కొలంబో, ఢాకా, హాంకాంగ్, ఖాట్మండు మరియు సింగపూర్ సహా ఇతర గమ్యస్థానాలకు క్యారియర్ విమానాల మీద 20 శాతం తగ్గింపు అద్దెలు అమలుకానున్నాయి. ఈ పరిమిత కాల విక్రయంలో మొదటిగా వచ్చినవారికి , మొదటి ఇచ్చే పద్ధతి ఆధారంగా మరియు ఒక టికెట్ ద్వారా వెళ్లే మార్గం మరియు తిరుగు ప్రయాణాలకి రెండిటికి చెల్లుతుంది. ప్రమోషన్ లో భాగంగా బుక్ చేసిన టికెట్లను జనవరి 15, 2018 నుండి వర్తించే నిబంధనలు మరియు షరతులతో ప్రయాణించడానికి చెల్లుబాటు అవుతుంది.జెట్ ఎయిర్వేస్ నిర్వహించే విమానాల మీద మాత్రమే ఈ ప్రత్యేక ఛార్జీలు వర్తించబడతాయి. తమ ప్రయాణ అతిథులు టిక్కెట్లను ఎయిర్లైన్ స్ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా లేదా ట్రావెల్ ఎజెంట్ ద్వారా పొందవచ్చు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం