ఒమన్ నుండి భారతదేశం, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఛార్జీలలో డిస్కౌంట్ ను పొందండి
- January 12, 2018మస్కట్ : ఒమాన్ నుంచి భారతదేశానికి వచ్చే అన్నిఇండియన్ ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్ లలో 20 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎయిర్లైన్ ప్రకటించింది. దీని ప్రకారం, జనవరి 15, 2018 తర్వాత నాటి నుండి ప్రయాణీకులు బుకింగ్ లను చేసుకోవచ్చు. ఒమన్ నుండి భారతదేశం మరియు బ్యాంకాక్, కొలంబో, ఢాకా, హాంకాంగ్, ఖాట్మండు మరియు సింగపూర్ సహా ఇతర గమ్యస్థానాలకు క్యారియర్ విమానాల మీద 20 శాతం తగ్గింపు అద్దెలు అమలుకానున్నాయి. ఈ పరిమిత కాల విక్రయంలో మొదటిగా వచ్చినవారికి , మొదటి ఇచ్చే పద్ధతి ఆధారంగా మరియు ఒక టికెట్ ద్వారా వెళ్లే మార్గం మరియు తిరుగు ప్రయాణాలకి రెండిటికి చెల్లుతుంది. ప్రమోషన్ లో భాగంగా బుక్ చేసిన టికెట్లను జనవరి 15, 2018 నుండి వర్తించే నిబంధనలు మరియు షరతులతో ప్రయాణించడానికి చెల్లుబాటు అవుతుంది.జెట్ ఎయిర్వేస్ నిర్వహించే విమానాల మీద మాత్రమే ఈ ప్రత్యేక ఛార్జీలు వర్తించబడతాయి. తమ ప్రయాణ అతిథులు టిక్కెట్లను ఎయిర్లైన్ స్ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా లేదా ట్రావెల్ ఎజెంట్ ద్వారా పొందవచ్చు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..