తల్లి పేరుతో జక్కన్న చెక్కిన సరస్వతి నిలయం...!!
- January 12, 2018బుల్లి తెర నుంచి వెండి తెరపై దర్శకుడిగా అడుగు పెట్టిన రాజమౌళి.. బాహుబలి సినిమాతో తెలుగు వాడి జెండాను ప్రపంచ వ్యాప్తంగా ఎగరవేసి.. తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. కాగా తాను మంచి దర్శకుడినే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అని కూడా రాజమౌళి నిరూపించుకున్నారు. తన తల్లి జననీ రాజనందిని పేరిట పాఠశాల భవనం నిర్మించి తన ప్రత్యేకను చాటు కున్నారు. వివరాల్లోకి వెళ్తే...
2014 లో విశాఖ జిల్లాను హుదూద్ తుఫాను అతాకుతలం చేసింది. ఈ తుఫాన్ దాటికి విశాఖ లో పలు చెట్లు.. భారీ భవనాలు సైతం కూలిపోయాయి. అలా కూలిపోయిన భవనాల జాబితాను దర్శక దిగ్గజం రాజమౌళి పరిశీలించారు. ఆ లిస్ట్ లో 154 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ జిల్లా కశింకోటలోని దురిశేటి పెదనర్సింహ మూర్తి (డీపీఎన్) జెడ్పీ హై స్కూల్ కూడా ఉంది. దీంతో రాజమౌళి ఆ భవనాన్ని మళ్ళీ నిర్మించాలనుకున్నారు.. తన వంతు సాయంగా భవన నిర్మాణానికి రూ. 40లక్షలను అందించారు.. ఈ నేపథ్యంలో 2015 లో 4 గదులతో పాఠశాల భవననిర్మాణం ప్రారంభమైంది. ఇలా జక్కన్న చెక్కిన సరస్వతీ నిలయానికి తన తల్లి జననీ రాజనందిని పేరు పెట్టారు. అంతేకాదు.. భవన శిలాఫలకం పై రాజమౌళి తో పాటు ఎమ్ ఎమ్ కీరవాణి, వైఎస్ శోభనాద్రి, టి. ప్రశాంతి పేర్లు ఉన్నాయి. కాగా రాజమౌళి తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ