కన్నకూతుళ్లతో వ్యభిచారం చేయించిన దుర్మార్గపు తండ్రి
- January 17, 2018
దుబాయ్: కంటికి రెప్పలా కన్నకూతుళ్లను కాపాడాల్సిన ఓ దుర్మార్గుడైన ఓ తండ్రి దుబాయ్ లో కన్నకూతుళ్లతోనే వ్యభిచారం చేయిస్తున్నాడు. వలసదారుడిగా ఏదో పని నిమిత్తం దుబాయ్ వచ్చి పార్ట్ టైం పాపపు సొమ్ముతో తన దేశానికి వెళ్లి ధనవంతుడిగా స్థిరపడాలని యోచించాడు. కానీ, తమ తండ్రి తమను ఏ విధంగా డబ్బు సంపాదించే యంత్రాలుగా మార్చి దనం ఆర్జిస్తున్నాడో నిందితుని కుమార్తెలు పోలీసుల ఎదుట కన్నీళ్ల పర్యంతరమైపోయారు. వివరాలలోనికెళితే, కన్నకూతుళ్లతోనే వ్యభిచారం చేయించే నిందితునికి 10 మంది కుమార్తెలు , ఇద్దరు అబ్బాయిలు సంతానం కాగా, ఆ దుర్మార్గుడు దుబాయ్ వచ్చిన కొంతకాలానికి 18 ఏళ్లు నిండిన ఇద్దరు పెద్ద కూతుళ్లను దుబాయ్ రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. కొద్ది రోజుల గడిచిన తర్వాత మిగిలిన అమ్మాయిలందరినీ దుబాయ్ రప్పించాడు. వారిని స్థానిక నైట్ క్లబ్లలో డ్యాన్స్ చేయడానికి తీసుకెళ్లేవాడు. క్రమంగా వారితో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టాడు. చెప్పినట్లు వినకపోతే భోజనం పెట్టకుండా చిత్ర హింసలు పెట్టేవాడు. దాంతో కూతుళ్లందరూ తండ్రి చెప్పినట్లే వినేవారు . అయితే ఓ రోజు తమ దేశానికి చెందిన వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. అతడికి కూతుళ్లు అన్ని విషయాలు చెప్పారు. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. తమ తండ్రి తమతో వ్యభిచారం చేయిస్తున్నాడని ఒక్క రాత్రికి 200 దిర్హమ్స్ 300 దిర్హమ్స్ వసూలు చేస్తుంటాడని ఆ యువతులు పోలీసులకు చెప్పారు. పోలీసులు తండ్రిని కోర్టులో హజరుపరిచారు. కోర్టు ఈ కేసును జనవరి 24 వ తేదికి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!







