షేక్ జాయెద్ మెమోరియల్ జనవరి 22న ప్రారంభం
- January 18, 2018
యు.ఏ.ఈ:లేట్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ జ్ఞాపకార్థం నిర్మిస్తోన్న మెమోరియల్ జనవరి 22న అబుదాబీలో అధికారిక కార్యక్రమం ద్వారా ప్రారంభం కానుంది. అధికారిక ప్రారంభోత్సవం అన్ని ప్రముఖ జాతీయ టీవీ ఛానల్స్లోనూ ఉదయం 9.3 నిమిషాల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ఇయర్ ఆప్ జాయెద్ - షేక్ జాయెద్ 100వ జయంతి నేపథ్యంలో ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. 2018 స్ప్రింగ్ నుంచి పబ్లిక్ ఈ మెమోరియల్ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ప్రముఖ నాయకుడైన షేక్ జాయెద్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు, మాటలు, ల్యాండ్స్కేపింగ్ సహా ఎన్నో ఆకర్షణలు ఈ మెమోరియల్లో పొందుపరిచారు. అబుదాబీలోని ఫస్ట్, సెకెండ్ ఇంటర్సెక్షన్ వద్ద 3.3 హెక్టార్లలో ఈ మెమోరియల్ని తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







