బహ్రెయిన్ ఆటో ఫెయిర్ 2018 ప్రారంభం
- January 18, 2018![1 బహ్రెయిన్ ఆటో ఫెయిర్ 2018 ప్రారంభం](https://www.maagulf.com/godata/articles/201801/auto_1516280745.jpg)
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషావ్ు బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ఖలీఫా, బహ్రెయిన్ ఆటో ఫెయిర్ 2018 (బిఎఎఫ్)ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్లో ఈ బిగ్గెస్ట్ ఆటోమొబైల్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. సోలిడ్ విజన్, ఎలెవన్ అండ్ బ్రిడ్జ్తో కలిసి 20,000 చదరపు మీటర్ల వైశాల్యంలో, మనామా గుండెకాయ లాంటి ప్రాంతంలో ఈ ఈవెంట్ని నిర్వహిస్తోంది. బహ్రెయిన్ షాపింగ్ ఫెస్టివల్తోపాటుగా ఈ ఈవెంట్ జరుగుతోంది. జిసిసి దేశాల నుంచి వివిధ ఏజ్ గ్రూప్స్కి చెందినవారు సుమారుగా 40,000 మంది సందర్శకులు ఈ ఈవెంట్కి వస్తారని అంచనా వేస్తున్నారు. ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ షేక్ ఖలీఫా బిన్ దైజ్ అల్ ఖలీఫా, క్యాపిటల్ గవర్నరేట్ సహకారాన్ని అభినందించారు. టెస్ట్ డ్రైవ్ ఏరియా సహా, అనేక ఆకర్షణలు ఈ ఆటో షో ప్రత్యేకతలు. వివిధ రకాలైన కార్లు, ముఖ్యంగా లగ్జరీ కార్లు ఇక్కడ కొలువుదీరనున్నాయి. క్లాసిక్ ఎక్సోటిక్స్తోపాటు మోటర్ బైక్స్, మాడిఫైడ్ కార్స్ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. కార్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. జనవరి 21తో ఈ ఈవెంట్ ముగియనుంది.
తాజా వార్తలు
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు