బహ్రెయిన్ ఆటో ఫెయిర్ 2018 ప్రారంభం
- January 18, 2018
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషావ్ు బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ఖలీఫా, బహ్రెయిన్ ఆటో ఫెయిర్ 2018 (బిఎఎఫ్)ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్లో ఈ బిగ్గెస్ట్ ఆటోమొబైల్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. సోలిడ్ విజన్, ఎలెవన్ అండ్ బ్రిడ్జ్తో కలిసి 20,000 చదరపు మీటర్ల వైశాల్యంలో, మనామా గుండెకాయ లాంటి ప్రాంతంలో ఈ ఈవెంట్ని నిర్వహిస్తోంది. బహ్రెయిన్ షాపింగ్ ఫెస్టివల్తోపాటుగా ఈ ఈవెంట్ జరుగుతోంది. జిసిసి దేశాల నుంచి వివిధ ఏజ్ గ్రూప్స్కి చెందినవారు సుమారుగా 40,000 మంది సందర్శకులు ఈ ఈవెంట్కి వస్తారని అంచనా వేస్తున్నారు. ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ షేక్ ఖలీఫా బిన్ దైజ్ అల్ ఖలీఫా, క్యాపిటల్ గవర్నరేట్ సహకారాన్ని అభినందించారు. టెస్ట్ డ్రైవ్ ఏరియా సహా, అనేక ఆకర్షణలు ఈ ఆటో షో ప్రత్యేకతలు. వివిధ రకాలైన కార్లు, ముఖ్యంగా లగ్జరీ కార్లు ఇక్కడ కొలువుదీరనున్నాయి. క్లాసిక్ ఎక్సోటిక్స్తోపాటు మోటర్ బైక్స్, మాడిఫైడ్ కార్స్ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. కార్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. జనవరి 21తో ఈ ఈవెంట్ ముగియనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









