తెలంగాణాలో పట్టభద్రులకు శుభవార్త
- November 22, 2015
నగరంలో నివసిస్తున్న పట్టభద్రులకు శుభవార్త. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. ఏదేనీ డిగ్రీ పొంది, 20 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఇంటరవ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైనవారికి ప్రారంభవేతనం రూ. 12 వేలు. అంతేకాక ఇతర ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికేట్లతో ఈ నెల 26న (గురువారం) విజయనగర్ కాలనీలోని హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి రావచ్చని, ఉదయం 10:30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయని హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారి కె. నాగభారతి ఓ ప్రకటనలో తెలిపారు. సమగ్ర వివరాల కోసం 81217 28818 నెంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







