తెలంగాణాలో పట్టభద్రులకు శుభవార్త
- November 22, 2015
నగరంలో నివసిస్తున్న పట్టభద్రులకు శుభవార్త. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. ఏదేనీ డిగ్రీ పొంది, 20 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఇంటరవ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైనవారికి ప్రారంభవేతనం రూ. 12 వేలు. అంతేకాక ఇతర ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికేట్లతో ఈ నెల 26న (గురువారం) విజయనగర్ కాలనీలోని హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి రావచ్చని, ఉదయం 10:30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయని హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారి కె. నాగభారతి ఓ ప్రకటనలో తెలిపారు. సమగ్ర వివరాల కోసం 81217 28818 నెంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్







