రైలు ప్రమాదంలో మరాఠి నటుడు దుర్మరణం.
- January 23, 2018
ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కబోతూ ప్రమాద వశాత్తు అదే రైలు కిందపడి మరాఠి యువ నటుడు ప్రపుల్లా భలేరావు దుర్మరణంపాలయ్యాడు.. అతడి వయసు 22 సంవత్సరాలు. తన స్వగ్రామమైన గిర్ గాంకు వెళ్లాలన్న ప్రయత్నంలో మలాద్ స్టేషన్ కు వచ్చిన ప్రపుల్లా, నడుస్తున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన అతనిని దగ్గరలోనే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించాడని వైద్యులు వెల్లడించారు. కాగా, ప్రఫుల్లా భలేరావు బాల నటుడిగా పరిచయమై గుర్తింపు పొందాడు. మరాఠీ టీవీల్లో ప్రసారమైన 'కుంకు', 'తు మాజా సంగతి', 'నకౌషి', 'జ్యోతిబా పూలే' తదితర సీరియల్స్ లలో నటించాడు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









