రైలు ప్రమాదంలో మరాఠి నటుడు దుర్మరణం.
- January 23, 2018
ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కబోతూ ప్రమాద వశాత్తు అదే రైలు కిందపడి మరాఠి యువ నటుడు ప్రపుల్లా భలేరావు దుర్మరణంపాలయ్యాడు.. అతడి వయసు 22 సంవత్సరాలు. తన స్వగ్రామమైన గిర్ గాంకు వెళ్లాలన్న ప్రయత్నంలో మలాద్ స్టేషన్ కు వచ్చిన ప్రపుల్లా, నడుస్తున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన అతనిని దగ్గరలోనే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించాడని వైద్యులు వెల్లడించారు. కాగా, ప్రఫుల్లా భలేరావు బాల నటుడిగా పరిచయమై గుర్తింపు పొందాడు. మరాఠీ టీవీల్లో ప్రసారమైన 'కుంకు', 'తు మాజా సంగతి', 'నకౌషి', 'జ్యోతిబా పూలే' తదితర సీరియల్స్ లలో నటించాడు.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!