పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌లో భూప్రకంపనలు

- November 22, 2015 , by Maagulf
పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌లో భూప్రకంపనలు

పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత భూప్రకంపనలు సంభవించాయి. భూంకప లేఖినిపై తీవ్రత 6.2గా నమోదైంది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌, లాహోర్‌, రావల్పిండి, ఫైసలాబాద్‌, ఆఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్థాన్‌లోని ఖైబర్‌-పఖ్తున్‌క్వా ప్రాంతంలో, స్వాత్‌ లోయలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆఫ్గనిస్థాన్‌, తజకిస్థాన్‌ సరిహద్దులోని భూగర్భంలో 86 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పాక్‌ భూ విజ్ఞాన కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో జమ్ముకశ్మీర్‌, దిల్లీలోనూ భూమి కంపించింది. ఉత్తర భారతంలోని పలుచోట్ల భూ ప్రకంపనలు ఏర్పడినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com