కెనడా మహిళకు లాటరీలో 6.20 కోట్లు ...ఇద్దరు ప్రవాసియ భారతీయులకు బీఎండబ్ల్యూ కార్లు
- January 23, 2018
దుబాయ్: ' ఎవరో వస్తారని...ఏదో చేస్తారని.. ఎదురు చూసి మోసపోకుమా అంటూ హెచ్చరిస్తూ ' కూలి డబ్బుతో లాటరీ టికెట్ ' అని పాత తెలుగు సినిమాలో సినీ గేయ రచయత లాటరీలను ఒక రకంగా గేలి చేశారు..అయితే గల్ఫ్ లో మాత్రం నిర్బయంగా లాటరీ టికెట్ కొనుక్కోవచ్చు. కెనడా మహిళకు ఆరు కోట్ల 20 లక్షలు .. కాయకష్టం నమ్ముకొని ఎడారి దేశాలకు వెళ్ళిన ఇద్దరు ప్రవాసియ భారతీయ కార్మికులకు ద్వితియ, తృతియ విజేతలుగా నిలవడంతో బీఎండబ్ల్యూ కార్లు బహుమతులుగా లభించాయి. దుబాయ్ లో నిర్వహించిన బంపర్ డ్రా పుణ్యమాని పలువురు కోటీశ్వరులుగా మారిపోతున్నారు..దుబాయ్ నగరంలో నివాసముంటున్న నిక్ పసిక్కో అనే కెనడా మహిళను భారీ లాటరీ లో ప్రధమ బహుమతి లభించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ డ్రాలో లక్కీ విజేతగా ఆమె నిలిచింది. దీంతో ఆమెకు 3.6 మిలియన్(1 మిలియన్ డాలర్లు) దిర్హమ్లపైగా భారీ డబ్బు దక్కనుంది. భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.6.30 కోట్లపైగా ఆమెకు లభించనున్నాయి. టికెట్ కొనుగోలు చేసిన సమయంలో విజేతను అవుతానని ఏమాత్రం భావించలేదని విజేత తెలిపింది. ఆ మొత్తానికి చెక్ అందుకోవడంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే లక్కీడ్రాలో భారత్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ద్వితియ, తృతియ విజేతలుగా నిలిచి బీఎండబ్ల్యూ కార్లను బహుమతులుగా సొంతం చేసుకున్నారని నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







