మహిళల గోప్యతను రక్షించడానికి సౌదీ మహిళా న్యాయవాదులు నియామకం
- January 25, 2018_1516937745.jpg)
రియాద్ : పురుషుల నిష్పత్తికి అనుగుణంగా మహిళా న్యాయవాదులను ఇకపై సమాన హోదాతో భర్తీ చేస్తారని సౌదీ అరేబియా అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్ మోజబ్ తెలిపారు. స్థానిక విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మహిళల రక్షణకు,మహిళా గోప్యతను కాపాడేందుకు ఉద్దేశించిన ఉద్యోగాలని ఆయన పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో మహిళల పాత్రకు అవసరమైన విజన్ 2030 అవసరాలకు అనుగుణంగా ఆయా నియామకాలు జరగనునట్లు ఆయన వివరించారు. అవినీతి ఆరోపణలు ఉన్న మహిళలకు సంబంధించిన కేసులను మహిళలచేతనే నిస్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు చేయడానికి కొత్త ఉద్యోగాలు (మహిళా పరిశోధకులు) న్యాయవ్యవస్థ లో సృష్టించినట్లయితే, సాధారణ ప్రాసిక్యూటర్ మహిళలపై ఎటువంటి ఆరోపణలు లేవని చెప్పారు. ఒకవేళ అలాంటి కేసు గనుక తమ దృష్టికి వస్తే , ఈ వ్యవస్థ ద్వారా ఏ విధమైన వివక్షత లేకుండా విచారణ నిజాయితీగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. అవసరమైతే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉద్యోగాలలోని ఇతర ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు ఆల్-మోజబ్ చెప్పారు. మహిళల హోదాల్లోని పరిస్థితులపై అల్ మోజబ్ మాట్లాడుతూ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉద్యోగాలలో మహిళ ..పురుష ఉద్యోగులకు సమాన స్థాయిలోనే ఆయా పరిస్థితులు వర్తిస్తాయిన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు