బేబీ గేమ్స్ ప్యానెల్ తొలి మీటింగ్
- January 26, 2018
మనామా: బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఎసి), మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రతినిథులతో సమావేశం ఏర్పాటు చేసింది. బహ్రెయిన్లో బేబీ గేమ్స్ నిర్వహణకు సంబంధించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కిండర్గార్టెన్స్కి ఆటల పోటీలు నిర్వహించడంపై పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఇసా స్పోర్ట్స్ కాంప్లెక్స్ - రిఫ్ఫాలో పలు రకాలైన ఆటల పోటీలు పిల్లల కోసం నిర్వహించాలనే డిమాండ్లు వస్తున్నాయి. బిఓసి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ లోనెస్ మాదెన్, ఈ మేరకు ఓ ప్రెజెంటేషన్ని ఈ సమావేశంలో ఇచ్చారు. ఏప్రిల్లో పోటీలు నిర్వహిస్తారు. అన్ని కిండర్గార్టెన్స్ ఈ పోటీలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనీ, ఫిబ్రవరి 8లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సమావేశంలో తీర్మానించారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









