సౌదీ యాక్సిడెంట్: ఏడుగురు మహిళలు దుర్మరణం
- January 27, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలోని జజాన్ రీజియన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సౌదీ గెజిట్ రిపోర్ట్ ప్రకారం మదయా - షవర్మా రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు, ట్రక్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్ళికి వెళుతుండగా, బాధిత కుటుంబం ఈ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సివిల్ డిఫెన్స్ యూనిట్స్, సంఘటన గురించి సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. సౌదీ రెడ్ క్రిసెంట్ వాలంటీరులు సకాలంలో చాకచక్యంగా వ్యవహరించారని సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిథి జజాన్ లెప్టినెంట్ కల్నల్ యహ్యా ఖహ్తాని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







