సౌదీ యాక్సిడెంట్: ఏడుగురు మహిళలు దుర్మరణం
- January 27, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలోని జజాన్ రీజియన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సౌదీ గెజిట్ రిపోర్ట్ ప్రకారం మదయా - షవర్మా రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు, ట్రక్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్ళికి వెళుతుండగా, బాధిత కుటుంబం ఈ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సివిల్ డిఫెన్స్ యూనిట్స్, సంఘటన గురించి సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. సౌదీ రెడ్ క్రిసెంట్ వాలంటీరులు సకాలంలో చాకచక్యంగా వ్యవహరించారని సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిథి జజాన్ లెప్టినెంట్ కల్నల్ యహ్యా ఖహ్తాని చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి