సౌదీ యాక్సిడెంట్: ఏడుగురు మహిళలు దుర్మరణం
- January 27, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలోని జజాన్ రీజియన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సౌదీ గెజిట్ రిపోర్ట్ ప్రకారం మదయా - షవర్మా రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు, ట్రక్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్ళికి వెళుతుండగా, బాధిత కుటుంబం ఈ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సివిల్ డిఫెన్స్ యూనిట్స్, సంఘటన గురించి సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. సౌదీ రెడ్ క్రిసెంట్ వాలంటీరులు సకాలంలో చాకచక్యంగా వ్యవహరించారని సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిథి జజాన్ లెప్టినెంట్ కల్నల్ యహ్యా ఖహ్తాని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







