సౌదీ యాక్సిడెంట్: ఏడుగురు మహిళలు దుర్మరణం
- January 27, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలోని జజాన్ రీజియన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సౌదీ గెజిట్ రిపోర్ట్ ప్రకారం మదయా - షవర్మా రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు, ట్రక్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్ళికి వెళుతుండగా, బాధిత కుటుంబం ఈ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సివిల్ డిఫెన్స్ యూనిట్స్, సంఘటన గురించి సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. సౌదీ రెడ్ క్రిసెంట్ వాలంటీరులు సకాలంలో చాకచక్యంగా వ్యవహరించారని సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిథి జజాన్ లెప్టినెంట్ కల్నల్ యహ్యా ఖహ్తాని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







