అంగరంగ వైభవంగా 'రెహ్మాన్' కాన్సెర్ట్
- January 27, 2018
దుబాయ్:జనవరి 26న సంగీత మాంత్రికుడు ఎ.ఆర్.రెహమాన్ కాన్సెర్ట్ అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ పార్క్స్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆహూతులు అత్యద్భుతంగా ఎంజాయ్ చేశారు. రెహమాన్ లైవ్ పెర్ఫామెన్స్కి తోడు, అర్మాన్ మాలిక్, నీతి మోహన్, బెన్నీ దయాల్, జోనితా గాంధీ, హరిచరణ్ శేషాద్రి, హర్షదీప్ కౌర్, జావెద్ అలీ ఈ కార్యక్రమానికి విచ్చేసినవారిని అలరించారు, తమ పాటలతో సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయారు. కనీ వినీ ఎరుగని రీతిలో తీర్చిదిద్దిన స్టేజ్, మిరుమిట్లు గొలిపే దీప కాంతులు, ఒకటేమిటి రెహమాన్ కాన్సెర్ట్ నభూతో నభవిష్యతి అనే రేంజ్లో జరిగింది. 'కాదల్ దేశం'లోని 'ముస్తఫా ముస్తఫా' సాంగ్కి ఆడియన్స్ సైతం పదం, పాదం రెండూ కలిపేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఈ ప్రోగ్రామ్ అత్యద్బుతంగా సాగింది. ఎముకలు కొరికే చలిని, మంచునీ ఎవరూ లెక్క చేయలేదు. ఓ పక్క హీటెక్కించే పెర్ఫామెన్స్లు, ఇంకోపక్క చలి రెండూ బ్యాలెన్స్ అయిపోయాయి.



తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









