ఆధిక్యంలో తెరాస అభ్యర్థి దయాకర్
- November 23, 2015
వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్యార్డులో వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ ప్రత్యర్థులకు అందనంత భారీ అధిక్యంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం 2,90,779 ఓట్ల ఆధిక్యంలో దయాకర్ ఉన్నారు తొలి నుంచి అన్ని రౌండ్లలోనూ దయాకర్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నం 2గంటల కల్లా తుది ఫలితం వెలువడే అవకాశముంది. వరంగల్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కరుణ, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్బాబు పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







