భారత్కి సలామ్ ఎయిర్ విమానాలు!
- January 29, 2018
మస్కట్: ఒమన్ తొలి బడ్జెట్ ఎయిర్లైన్ సలామ్ ఎయిర్, ఇండియాకి విమాన సర్వీసుల్ని ప్రారంభించనుంది. ఇండియా, తమకు సక్సెస్ఫుల్ రూట్గా మారుతుందని సలామ్ ఎయిర్ సీఈఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ఇండియాకి విమానాలు నడిపేందుకుగాను సంబంధిత అధికార వర్గాల నుంచి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన వివరించారు. ఇండియాలో ఎక్కడికి విమానాలు నడిపినా, అది తమకు లాభదాయకంగానే ఉంటుందని చెప్పారాయన. ఇండియా - ఒమన్ మధ్య 2016లో కుదిరిన ఒప్పందం ప్రకారం, వారానికి 27,405 సీట్లకు (ఇరువైపులా) అనుమతి లభించింది. గతంలో ఈ సంఖ్య 21,145గా ఉండేది. తమ వెబ్సైట్ ద్వారా ట్రావెల్ ప్యాకేజీలను వెల్లడించనున్నట్లు కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ఈ సమ్మర్లో బాకు (అజర్బైజాన్), త్బిలిసి (జార్జియా)లకు విమానాలు ప్రత్యేకంగా నడిపే యోచన చేస్తున్నట్లు వెల్లడించారాయన. ఉమ్రా ప్యాకేజీలను సైతం సలామ్ ఎయిర్ ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!







