భారత్కి సలామ్ ఎయిర్ విమానాలు!
- January 29, 2018
మస్కట్: ఒమన్ తొలి బడ్జెట్ ఎయిర్లైన్ సలామ్ ఎయిర్, ఇండియాకి విమాన సర్వీసుల్ని ప్రారంభించనుంది. ఇండియా, తమకు సక్సెస్ఫుల్ రూట్గా మారుతుందని సలామ్ ఎయిర్ సీఈఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ఇండియాకి విమానాలు నడిపేందుకుగాను సంబంధిత అధికార వర్గాల నుంచి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన వివరించారు. ఇండియాలో ఎక్కడికి విమానాలు నడిపినా, అది తమకు లాభదాయకంగానే ఉంటుందని చెప్పారాయన. ఇండియా - ఒమన్ మధ్య 2016లో కుదిరిన ఒప్పందం ప్రకారం, వారానికి 27,405 సీట్లకు (ఇరువైపులా) అనుమతి లభించింది. గతంలో ఈ సంఖ్య 21,145గా ఉండేది. తమ వెబ్సైట్ ద్వారా ట్రావెల్ ప్యాకేజీలను వెల్లడించనున్నట్లు కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ఈ సమ్మర్లో బాకు (అజర్బైజాన్), త్బిలిసి (జార్జియా)లకు విమానాలు ప్రత్యేకంగా నడిపే యోచన చేస్తున్నట్లు వెల్లడించారాయన. ఉమ్రా ప్యాకేజీలను సైతం సలామ్ ఎయిర్ ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







