అన్ని రౌండ్లలోనూ దయాకర్ ఆధిక్యం ..
- November 24, 2015
వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్యార్డులో వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ ప్రత్యర్థులకు అందనంత భారీ అధిక్యంలో దూసుకుపోతున్నారు. 13 వ రౌండ్ పూర్తయ్యే సరికి దయాకర్ 3,31,089 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 13వ రౌండ్ పూర్తయ్యే సరికి తెరాస అభ్యర్థికి 4,43, 915, కాంగ్రెస్ అభ్యర్థికి 1,12,8229, భాజపాకు 89,828 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తొలి నుంచి అన్ని రౌండ్లలోనూ దయాకర్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నానికల్లా తుది ఫలితం వెలువడే అవకాశముంది. వరంగల్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కరుణ, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్బాబు పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







