'జిల్' సినిమా జోడీ మరోసారి....
- November 24, 2015
'జిల్' సినిమా కమర్సియల్ గా పెద్దగా వర్కౌట్ కాకపోయినా...గోపీచంద్, రాశి ఖన్నా మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. త్వరలో ఈ ఇద్దరూ మరోసారి కలిసి చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో తరుణ్తో 'నీ మనసు నాకు తెలుసు' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. మూడేళ్ల క్రితం వచ్చిన 'ఊ లలలా' తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వంలో సినిమాలేవీ రాలేదు. అయితే రీసెంట్గా ఓ స్టోరీని గోపీచంద్కు వినిపించి ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జిల్ సినిమాలో గోపీచంద్, రాశి ఖన్నా జోడీ బాగా కుదరడంతో వారితోనే సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం గోపీచంద్ చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత 2016లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా సాయి ధరమ్ తేజ్ కు జోడీగా 'సుప్రీమ్' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు ఆమె నటించిన 'బెంగాల్ టైగర్' మూవీ విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి రూపొందిస్తున్న సౌఖ్యం సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్య కాలంలో హిట్లకు దూరమైన గోపీచంద్ ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







