రేపు తెలంగాణ వ్యాప్తంగా 2 నిమిషాలు మౌనం
- January 29, 2018
హైదరాబాద్ : మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం ( జనవరి-30) తెలంగాణ వ్యాప్తంగా 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మౌనం పాటించాలని స్పష్టం చేసింది. ఆ సమయంలో రహదార్లపై వాహన రాకపోకలు కూడా నిలిపివేయాలని అధికారులకు సూచించింది. సరిగ్గా ఉదయం 11 గంటలకు మౌనం పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్ని అధికారులను ఆదేశించింది. ప్రజలు కూడా సహకరించాలని కోరింది ప్రభుత్వం. స్వాతంత్య్రం కోసం బలిదానం చేసిన వారి త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









