సివిక్ ఎంటర్ప్రెన్యూర్ 'దీపికా శర్మ'కు అరుదైన గౌరవం
- January 29, 2018
హైదరాబాద్:అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ద్వారా దావోస్లో జరిగిన వార్షిక సమావేశాల్లో 'వాయిస్ ఆఫ్ ది యూత్' రిప్రెజెంటేషన్ కోసం టాలీవుడ్ నటుడు సతీమణి దీపికా ప్రసాద్(సివిక్ ఎంటర్ప్రెన్యూర్) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అర్బన్ గవర్నెన్స్ ఇనీషియేటివ్ - లకీర్ కో-ఫౌండర్గా దీపికా ప్రసాద్ బాధ్యతల్ని నిర్వహిస్తుండడం చాలా గొప్ప విషయం. దావోస్లో జనవరి 23 నుంచి 26 వరకు జరిగిన ఈవెంట్స్లో భారతదేశానికి చెందిన 150 మంది ప్రముఖులు, 3 వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు. పలు దేశాల అధినేతలు, ప్రపంచ ప్రక్యాత సంస్థలకు చెందిన అధిపతులు, సివిల్ సొసైటీ లీడర్స్ ఈ ఈవెంట్స్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఏ.పి మినిస్టర్ నారా లోకేష్ తదితరులు ఈ ఈవెంట్స్లో పాలుపంచుకున్నారు. ముఖేష్ అంబానీ, చందా కొచ్చర్, ఎరిక్ సచ్మిద్త్, షెరల్ సాండ్బర్గ్, సత్య నాదెళ్ళ వంటి ప్రముఖులు అదనపు ఆకర్షణగా నిలిచారు. హైద్రాబాద్లోని గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీకి క్యూరేటర్గా ఉన్న దీపికా శర్మ, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ - దావోస్లో యువతరం గళాన్ని వినిపించారు. 8 ఏళ్ళుగా ఆమె సౌత్ ఏసియా, ఈస్ట్ ఆఫ్రికాలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ గౌరవం లభించింది.నగరాల వైపుగా తరలుతున్న గ్రామీణ భారతం, పట్టణాల్లో పెరుగుతున్న ఉద్యోగావకాశాలు, అభివృద్ధి ఇతరత్రాల విషయాలపై దీపిక, వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రసంగించారు. జనాభా పెరుగుదలతో వచ్చే సమస్యలు, వాటిని ఎదుర్కొనేందుకు ఉన్న మార్గాల గురించీ ఆమె ప్రస్తావియించారు తన ప్రసంగంలో. వరల్డ్ బ్యాంక్, ఐఎఫ్సి, రాకెఫెల్లర్ ఫౌండేషన్, బోష్, యూనిలీవర్, గిజ్, షెల్ ఫౌండేషన్, ప్రదాన్ వంటి ప్రముఖ సంస్థలకు ఆమె సలహాదారుగా, సపోర్టర్గా పనిచేశారు. స్టార్టప్ వేవ్ పేరుతో అతి పెద్ద వర్చ్యువల్ ఇన్క్యుబేషన్ ప్లాట్ఫామ్ని కూడా దీపిక రూపొందించారు.




తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ న్యూక్లియర్ సైన్స్ ఒలింపియాడ్–2026కు సౌదీ ఆతిథ్యం..!!
- ఒమన్లో 28 మంది ఆసియన్లు అరెస్ట్..!!
- 120 డేస్ సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలి.. కువైట్లో కొత్త చట్టం..!!
- సిమ్ కార్డుల కొనుగోలుపై బహ్రెయిన్ పోలీసుల వార్నింగ్..!!
- ప్రపంచ ఇంటెలిజెంట్ సిటీస్ జాబితాలో దోహా..!!
- ఏసీఐ వరల్డ్ లెవల్-5 అక్రెడిటేషన్ సాధించిన జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం
- హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం...
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్తో మరింత విస్తరించనున్న రవాణా వ్యవస్థ..
- ఆపదలో ఉన్న వేలాది మందికి అండగా GDRFA దుబాయ్..
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..







